భాజపా లో చేరటం లేదు : ఈటల
హుజురాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని వెల్లడి

Hyderabad: తాను మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానని, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చెప్పారు.బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తాజాగా ఓ మీడియా ఛానెల్తో ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజురాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని, త్వరలో తుది నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/