బుల్లెట్ బైక్ ఫై మంత్రి ఎర్రబెల్లి చక్కర్లు

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుల్లెట్ బైక్ ఫై చక్కర్లు కొట్టారు. పాలకుర్తి లో పార్టీ ప్లీనరీ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా సభ స్థలి, సభ ఏర్పాట్లను పరిశీలించి స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత కొత్త బుల్లెట్ బైక్ కొనగా.. దానిని నడపాలని మంత్రిని గులాబీ శ్రేణులు కోరారు. దీంతో వారి కోరిక మేరకు మంత్రి బుల్లెట్ బైక్ ఫై చక్కర్లు కొట్టారు. ప్లీనరీ సమావేశం ప్రాంతంలో బుల్లెట్ బండిపై తిరిగిన ఆయన.. సభాస్థలి నుండి మన్ పహాడ్ వరకు బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లారు. మంత్రి బుల్లెట్ బైక్ నడపడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఎర్రబెల్లి బైక్‌పై వెళుతుండటాన్ని గమనించిన వాహనదారులు.. ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది దీనిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.