వేదింపులు తట్టుకోలేక వరంగల్ లో మరో విద్యార్థిని ఆత్మ హత్య
సీనియర్ వేదింపులు తట్టుకోలేక మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఆత్మ హత్య చేసుకున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారగా…ఇప్పుడు మరో విద్యార్థిని ప్రేమ పేరుతో వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం సంచలంగా మారింది.
జయశంకర్ భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత(21) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. తన క్లాస్మేట్తో కలిసి ఉన్న ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలత చెందిన రక్షిత.. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో రక్షిత సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.
అంతకుముందే రాహుల్ వేధింపులు ఎక్కువవ్వడంతో హాస్టల్లో ఉండలేనంటూ రక్షిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. ఆదివారం బంధువుల ఇంట్లోనే ఉన్న రక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు. ఇక కేసులో రాహుల్ ను భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.