కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మే 10న ఒకే దశలో ఎన్నికలు ..

election commission

న్యూఢిల్లీః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2023, ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 113 గాఉంది. 2018 ఎన్నికల్లో బిజెపి 104, కాంగ్రెస్ 80, జెడిఎస్ 37 స్థానాలలో గెలుపొందింది. మధ్యలో జరిగిన ఉప ఎన్నికలతో బిజెపి బలం 119 స్థానాలకు పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ కు 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి.

ఈసీ వెల్లడించిన వివరాలు..

.కర్ణాటకలో మొత్తం 5. 21 కోట్ల మంది ఓటర్లు
.కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు
.గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
.కర్ణాటకలో మొత్తం 58, 282 పోలింగ్ కేంద్రాలు
.ఓటు హక్కు పొందిన 41,312 మంది ట్రాన్స్ జెండర్లు
.80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే చాన్స్
.దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
.తొలిసారి ఓటర్లు 9.17 లక్షలు
.మహిళల కోసం ప్రత్యేకంగా 13 వందలకు పైగా పోలింగ్ స్టేషన్లు
.ఎన్నికల్లో ధన ప్రలోభాలను నివారించేందుకు స్పెషల్ టీమ్ లు