ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసారు. 1న తాండూరు లో ఆయన ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 2న కర్ణాటక గుల్బర్గా పార్లమెంట్ లో ప్రచారం చేస్తున్నారు. 3న మెదక్ పార్లమెంట్ పరిధిలో, 4న మహారాష్ట్ర సోలాపూర్ పార్లమెంట్ లో ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు బీజేపీ ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్.. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన లకు సైతం దూరంగా ఉన్నారు. తాజాగా ప్రచారంలో పాల్గొంటుండటంతో రాజాసింగ్ అలకవీడారా? లేక తప్పని పరిస్థితుల్లో దిగి వచ్చారా? అనే చర్చ జరుగుతోంది.