బాబు కు ‘ఈసీ’ నోటీసులు

chandrababu public meeting in Anakapalle District Madugula

పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తుంది. దీంతో ప్రజా ప్రతినిదులు తమ ప్రచారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదు. సోషల్ మీడియా లో సైతం అసభ్యకర పోస్టులు వంటివి పోస్ట్ చేయకూడదు. అయితే ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ..సీఎం జగన్ ఫై సోషల్ మీడియా లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఎన్నికల సంఘానికి పిర్యాదు లు అందడం తో ఈసీ..బాబు కు నోటీసులు జారీ చేసింది.

చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌పై సీఎం జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసేలా ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ నోటీసులు పంపారు. టీడీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు.