ఢిల్లీలో భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై 2.7 గా నమోదు
దిల్లీ: దేశ రాజధానిలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనలు 2.7గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండోసారి. భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనలకు గురి అయి రోడ్లమీదకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తుంది. కాగా నిన్న తూర్పు డిల్లీ కేంద్రంగా 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/