నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
సెన్సెక్స్ 469… నిఫ్టీ 118
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లనుంచి ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 469 పాయింట్లు నష్టపోయి,30,690 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి 8,993 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.27 గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/