ఐపిఎల్‌ రద్దయితే ధోనికి అవకాశాలు సన్నగిల్లినట్లే..

గౌతం గంభీర్‌ అభిప్రాయం

goutham gambhir
goutham gambhir

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) జరగక పోతే ధోని పునరాగమనం చేయడం చాలా కష్టమని భారత మాజీ ఆటగాడు, పార్లమెంట్‌ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా కారణంగా ఐపిఎల్‌ వాయిదా పడుతు వస్తుంది. తాజాగా దేశంలో లాక్‌డౌన్‌ పొడగిస్తారన్న వార్తల నేపథ్యంలో ఐపిఎల్‌ నిర్వహణపై పలు సందేహాలు వెల్లడవుతున్నాయి. అయితే ఐపిఎల్‌లో ఆడి తిరిగి భారత జట్టులో చేరాలని భావిస్తున్న మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యం ఇపుడు డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ ధోని ఆటతీరును సెలక్టర్‌లు అంచనా వేసేందుకు ఐపిఎల్‌ ఒక్కటే మిగిలి ఉందని అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్‌ జరగకపోతే ధోనికి అవకాశాలు సన్నగిల్లినట్లేనని పేర్కోన్నాడు. అయితే ధోని ఎపుడు రిటైర్‌ అవ్వాలన్నది అతని వ్యక్తిగత విషయం అని గంభీర్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/natio