కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా డీకే శివకుమార్

కేపీసీసీ చీఫ్ గా శివకుమార్ కు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

DK Shivakumar
DK Shivakumar

కర్ణాటక: కర్ణాటక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. కేపీసీసీ చీఫ్ గా దినేశ్ గుండూరావు స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. వీరితోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్‌లను కూడా మారుస్తూ ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అజయ్ సింగ్ (అసెంబ్లీలో చీఫ్ విప్), నారాయణ స్వామి (శాసనమండలిలో చీఫ్ విప్) గా నియమించారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు ప్రస్తుతం ఉన్న సీఎల్పీ నేత పదవి, ప్రతిపక్ష నేత హోదాను కొనసాగించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. గతంలో తాను శివకుమార్ తో ఉన్న ఫొటోను పంచుకున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/