రేవంత్ మెట్టు దిగాడా..?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..కేసీఆర్ ఫై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లేనా..? అంటే అవుననే చెప్పాలి. ములుగు లో పాదయాత్ర లో భాగంగా కేసీఆర్ ఫై , సర్కార్ ఫై పలు విమర్శలు చేయడం..రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యల ఫై బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం..పలు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. సొంత పార్టీ నేతలు సైతం రేవంత్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు.

నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా.. రేవంత్ అలా అనాల్సింది కాదు అని తన అభిప్రాయం వెలిబుచ్చారు. మరికొంత మంది నేతలు కూడా.. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నా.. బయటికి చెప్పకపోవటం గమనార్హం. ఆయన అన్న వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలుగా కాకుండా పార్టీ మొత్తానికి వర్తిస్తాయని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ లోలోపలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో.. రేవంత్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై ఓ మెట్టు దిగినట్టు తెలుస్తోంది.