నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఇంటిపై దాడి

నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని ధర్మపురి సంజయ్ ఇంటి వద్ద సందీప్‌ వర్మ అనే వ్యక్తి హంగామా సృష్టించాడు. కారుతో ఇంటి గేటు, వాహనాలను ధ్వంసం చేశాడు.

సుమారు 20 నిమిషాలపాటు సందీవ్‌ వర్మ నానా రచ్చ చేశాడు. అసలు ఏం జరగుతుందో తెలియక సంజయ్‌ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సంజయ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. సంజయ్ ఇంటివద్ద హంగామా చేసిన సందీప్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను దీనిపై ఆరా తీస్తున్నారు. ఎందుకు దాడి చేశారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దాడి జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తోన్నారు.