వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలు మృతి

వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ భక్తురాలు మృతి చెందింది. సోమవారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మి ఆలయానికి వచ్చింది. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనం చేసుకోవటం కుదరలేదు. దీంతో మరుసటి రోజు స్వామివారిని దర్శించుకోవచ్చునని ఆలయంలోనే నిద్రించింది.

మంగళవారం రోజున దర్శనం కోసం కుటుంబంతో కలిసి లక్ష్మి క్యూ లైన్ లో నిల్చుంది. ఆలా కొంతదూరం వరకు లైన్లో నిలుచున్న లక్ష్మి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు ఏం అయిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది, వైద్యులు వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందినట్లుగా వెల్లడించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.