ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యః చంద్రబాబు
అమరావతిః బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైఎస్ఆర్సిపి అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వాళ్లు ధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకను అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.