హౌరా వెళ్తున్న జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

Fire breaks out in Howrah-bound Jan Shatabdi Express train, no casualties

న్యూఢిల్లీః భువనేశ్వర్‌ – హౌరా జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి . అయితే, అదృష్టవశాత్తు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌ నుంచి హౌరా వెళ్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కటక్‌ చేరుకోగానే మంటలు చెలరేగాయి. కోచ్‌ దిగువ భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం రైలు 7:15కి కటక్‌ నుంచి బయలుదేరి వెళ్లినట్లు వివరించారు.