కుటుంబ సభ్యులతో కలిసి పెద్దమ్మతల్లిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

మధ్యలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి

revanth-reddy

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకోనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు. మార్గమధ్యలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు.

మరోవైపు, గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బస్సుల్లో నేరుగా ఎల్బీ స్టేడియానికి తరలిస్తున్నారు. నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ భద్రత కల్పించారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రావాల్సి ఉందని సమాచారం.