ఢిల్లీలో మరోసారి ఆప్ విజయకేతనం

ఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ గెలుపు

AAP
AAP

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. గెలుపు దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకెళుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ విజయం సాధించారు. 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ గెలిచారు. పట్ పడ్ గంజ్, దేవ్ లీ, సంగం విహార్ నియోజకవర్గాల నుంచి వరుసగా మనీశ్ సిసోడియా, ప్రకాశ్, మోహనియాలు విజయం సాధించారు. కాగా, ఢిల్లీలో మరోసారి ఆప్ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/