కేంద్ర మంత్రి గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

తెలంగాణలో రహదారుల నిర్మాణంపై మంత్రితో చర్చ

Komatireddy Venkat Reddy and Union Minister nitin Gadkari
Komatireddy Venkat Reddy and Union Minister nitin Gadkari

న్యూఢిల్లీ: కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలోని పలు అంశాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో రహదారుల నిర్మాణం గురించి మంత్రితో చర్చించారు. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు రహదారి పనులకోసం రూ.200 కోట్లు, ఎన్ హెచ్-65 విస్తరణ పనులకోసం రూ.375 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబ్ నగర్, ఇల్లెందు మీదుగా హైదరాబాద్ కొత్తగూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినా మరమ్మతులు కావడంలేదని గడ్కరీకి ఎంపీ తెలిపారు. ఈ విషయంలో నాలుగేళ్ల క్రితం డీపీఆర్ సిద్ధమైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని కోమటిరెడ్డి చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/