సౌదీలో తుగ్గతున్న కోవిడ్ కేసులు
సోమవారం ఒక్కరోజే 5,524 రికవరీలు
రియాద్: కరోనా మహమ్మారి సౌదీ అరేబియాలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అదే సమయంలో కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రివకరీలు పెరుగుతుండటం ఊరటనిచ్చే విషయమని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కూడా ఏకంగా 5,524 రికవరీలు నమోదయ్యాయి. దీంతో మొత్తం రికవరీలు 2 లక్షలకు మార్కును దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,03,259 మంది కరోనా నుంచి కోలుకునట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న నమోదైన 2,429 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 2,53,349 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే సోమవారం 37 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 2,523కు చేరింది. ప్రస్తుతం సౌదీ దేశ వ్యాప్తంగా 47,567 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2,196 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/