సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన బిఆర్ఎస్ సర్కార్

దసరా సందర్బంగా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ద‌స‌రా బోన‌స్‌గా రూ. 711 కోట్లు విడుద‌ల‌య్యాయి. 42 వేల మంది సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 1.53 ల‌క్ష‌ల చొప్పున జ‌మ చేయ‌నుంది. ఒకటి రెండు రోజుల్లో ద‌స‌రా పండగ అడ్వాన్స్ కూడా చెల్లించే అవకాశం ఉందని సింగరేణి వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించ‌నున్న‌ట్టు సింగ‌రేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.