తలసాని ఫై రేవంత్ ఫైర్
సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు.. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హచ్చరించారు.
పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు.
కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో దీర్ఘకాలంగా ఉన్న అంశాలపై బోర్డ్ లో చర్చించామన్నారు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రహదారులను తెరవాలని, నాలా సమస్యలను పరిష్కరించాలని చర్చ జరిగిందని వెల్లడించారు. సివరెజ్ వ్యవస్థ సరిగా లేదు..కంటోన్మెంట్ లో సివరేజ్ ప్లాంట్ ప్రణాళిక ఏర్పాటు చేయాలని..కలుషిత నీటి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
కాగా.. నిన్న మంగళవారం తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారో వారికే తెలియాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని 45-50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. పేదలకు రూ.2 వేల పింఛన్, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిన పాపం కాంగ్రె్సదేనని ఆరోపించారు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయ చేయడం తప్ప.. అభివృద్ధి చేశామని ఓట్లడిగే దమ్ము బీజేపీకి లేదని విమర్శించారు. యజ్ఞాలు, యాగాలు చేయడమే కాకుండా.. యాదాద్రి వంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించిన కేసీఆర్ కంటే గొప్ప హిందువు దేశంలో ఎవరూ లేరని అన్నారు. ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతది’’’ అని పరోక్షంగా రేవంత్రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.