తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా సీపీఎం..

తెలంగాణ ఎన్నికల బరిలో సీపీఎం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పొత్తు కోసం ఎదురుచూసినప్పటికీ..అటు నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఇక ఎదురుచూసి ప్రయోజనం లేదని ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు 17 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. మొత్తం 20 స్థానాల్లో పోటీ చేస్తామన్న సీపీఎం(CPM) ప్రస్తుతానికి 17 స్థానాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. త్వరలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు.

సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే..

ఖమ్మం: పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, అశ్వారావుపేట.
నల్లగొండ: మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్.
యాదాద్రి భువనగిరి: భువనగిరి.
సూర్యాపేట: హుజూర్‌నగర్, కోదాడ.
జనగామ: జనగామ.
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం.
సంగారెడ్డి: పటాన్‌చెఱు.
హైదరాబాద్: ముషీరాబాద్.