సమంత.. పిల్ల‌లు కన‌డానికి సిద్దంగా ఉందంటూ సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత

గత వారం రోజులుగా చిత్రసీమలోనే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకులు మా ఎన్నికల అంశం , సమంత – చైతు విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యముగా సమంత – చైతు లు విడిపోవడం ఫై అంత రకరకాలుగా మాట్లాడుతున్నారు. సమంత తప్పు చేసిందని , సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చింద‌ని పుకార్లు చ‌క్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో సమంత నటిస్తున్న శాకుంతలం నిర్మాత నీలిమ గుణ.. స‌మంత గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను బయటకు తెలిపింది.

ఓ ప్ర‌ముఖ ఛానెల్ కు ఇంట‌ర్యూ ఇస్తూ.. సమంత – చైతు విడాకుల‌పై పలు విషయాలు తెలిపింది. ‘శాకుంతలం సినిమా కోసం తొలుత‌ సమంతను సంప్రదించాం. ఆ స‌మ‌యంలో ఆమె చిత్రాలను చేయకూడదని ఫిక్స్ అయింది. ఎందుకని ఆడ‌గా ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని తెలిపింది. కానీ పీరియాడిక్ సినిమా, కథ నచ్చడంతో ఓకే చెప్పింది. ఆ త‌రువాత చాలా షూటింగ్ విష‌యంలో చాలా ష‌ర‌తులు పెట్టింది. సాధ్య‌మ‌నంత త్వరగా షూటింగ్ పూర్తి కావాలి. ఎందుకంటే నేను ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇకపై ఇదే చివరి సినిమా కావొచ్చు” అని తెలిపింది. ఆమె చెప్పినట్లే షూటింగ్ ను పూర్తి చేసాం. కానీ ఆగస్ట్ లో ఏం జ‌రిగిందో.. తెలియ‌దు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడాకుల ప్ర‌క‌ట‌న చేయ‌డంతో షాక్ అయ్యామ‌ని నీలిమ తెలిపింది. ఈమె చెప్పినదాన్ని బట్టి చూస్తే.. పిల్ల‌లు కన‌డానికి సిద్దంగా ఉన్న స‌మంత‌కు చైతూ ఎందుకు విడాకులు ఇచ్చారు..? అక్కినేని ఫ్యామిలీ సభ్యులు ఏమైనా అభ్యంతరాలు తెలిపారా..? అనేది అర్ధం కావడం లేదు. మొత్తం మీద సామ్ – చైతు విడాకుల ఫై పూర్తీ విషయాలు తెలియాల్సి ఉంది.