జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమంటున్న సీపీఐ

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టిడిపి – జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ – జనసేన లతో మీము కూడా కలుస్తాం అంటున్నారు సీపీఐ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కేంద్రం పట్టించుకోవడం లేదని , టీడీపీ తో పవన్ పొత్తు పెట్టుకోవడంతో పవన్ ఫై బిజెపి కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

పవన్‌ కళ్యాణ్ ఎన్డీఏ ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం హర్షం దగ్గ విషమన్నారు. ఆయన గట్స్ ను మెచ్చుకొని తీరాల్సిందేనన్నారు రామకృష్ట. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో పవన్‌ను తాము అభినందిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని పక్కనబెట్టి టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఏం కలిసి పోటీ చేయాలని కోరారు. ఈ పొత్తుతో జగన్‌ ను ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు.