తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులు..నేడు కొత్తగా తొమ్మిది

కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుంది. చాపకింద నీరులా రోజు రోజుకు తన ఉదృతిని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఈ మహమ్మారి..ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్లీ వణికిస్తోంది. ఇప్పటీకే కేంద్రం కరోనా ఆంక్షలు మొదలుపెట్టడం తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ లు ధరించాలని హెచ్చరించాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే..గడిచిన ఇరవై నాలగు గంట‌ల్లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 27 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఒక‌రు రిక‌వ‌ర్ అయ్యారు. తాజాగా న‌మోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైద‌రాబాద్, ఒక‌రు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫ‌ర్‌లో రెండు నెల‌ల చిన్నారికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, ఆ పాప‌కు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పదేళ్ల లోపు చిన్నారులు… అరవై ఏళ్ల పైబడిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య అధికారులు సూచించారు.