వంట నూనె ధరలు రూ. 30 నుండి 40 తగ్గాయి
నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్న వేళ…వంట నూనెల ఆయిల్ సంస్థలు సామాన్య ప్రజలకు తీపి కబురు అందించారు. రూపాయి , రెండు రూపాయిలు కాదు ఏకంగా రూ. 30 నుండి 40 వరకు తగ్గించాయి. ఈ మేరకు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో తెలిపింది. వంట నూనెల ఉత్పత్తులపై దిగుమతి పన్ను భారాన్ని కేంద్రం ఇటీవల తగ్గించింది. రిఫైన్డ్ పామాయిల్పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి సవరించింది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్డ్ పామాయిల్ను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులకు అనుమతించింది.
ఈ తరుణంలో ఆయిల్ సంస్థలు నూనె ధరలను భారీగా తగ్గించాయి. అదానీ విల్మార్ (ఫార్చ్యూన్ బ్రాండ్), రుచి సోయ( మహాకోష్, సన్రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా బ్రాండ్స్), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్), బంగే(డాల్డా, గగన్, ఛంబల్ బ్రాండ్స్), జెమిని(ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్), సీఓఎఫ్సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్లు)తో పాటు ఇతర బ్రాండ్లు కూడా ధరలు తగ్గించాయని ఎస్ఈఏ పేర్కొంది. ఈ ప్రకటన సామాన్యులకు ఎంతో ఊరట కలిగించే విషయం.