బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైంది – పొంగులేటి

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రీసెంట్ గా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన పొంగులేటి..వరుస భేటీ లతో దూకుడు కనపరుస్తున్నారు. పొంగులేటి చేరిక తో కాంగ్రెస్ లో ఉత్సహం పెరిగింది. మరికొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ క్రమంలో పొంగులేటి..అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై నిప్పులు చెరుగుతున్నారు.

బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందని , ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా, జిత్తులు వేసినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, కాంగ్రెస్ వ్యక్తే సీఎం అవుతారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని , భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిలతో కలిసి పని చేస్తానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతున్న ప్రజాప్రతినిధులను ఇంటికి పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.