అమెరికాలో కరోనా విశ్వరూపం
ఒక్కరోజులోనే 4,491 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విశ్వరూపం దాల్చింది. ఒక్కరోజులోనే ఈ మహామ్మారి 4,491 మందిని బలితీసుకుంది. దీంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 34,562కు చేరుకుంది. ఇంతవరకు ఈ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కాగా ఇందులో కరోనా అనుమానిత మృతులను కూడా చేర్చడం జరిగింది. అమెరికాలో కరోనా భాధితుల సంఖ్య 6,75,243కు చేరింది. దీంతో మరణాల సంఖ్యలోను, కరోనా భాదితుల సంఖ్యలోను అమెరికా ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/