మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు

హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు

corona virus
corona virus

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్‌ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈమె ఈ నెల 14 మృతిచెందింది. అప్పటికే ఆమే శాంపిల్స్‌ ను టెస్టింగ్‌కు పంపగా వచ్చిన రిపోర్ట్‌లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారలు ముత్తరావుపల్లిలో హైఅలర్ట్‌ ప్రకటించారు. గ్రామంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలతో పాటు, ఆమెతో అనుభంధం ఉన్నవారి వివరాలను సేకరించే పనిలో అధికారలు నిమగ్నమయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/