భారత్‌లో 24 గంటల్లో 18,522 మందికి కరోనా

కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,66,840

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,522 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 418 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,840కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,893కి పెరిగింది. 2,15,125 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,10,292 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/