దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం
తాజాగా 3,79,257 కేసులు – 3,645 మంది మృతి-కరోనా టెస్టులు వేగవంతం
New Delhi: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 3,79,257 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 3,645 మంది మృతి చెందారు. ఉండగా ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,83,76,524 కేసులు రికార్డు అయ్యాయి. మొత్తం మరణాలు: 2,04,832 గా నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకున్నారు.
కాగా దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. నిన్నటికి 15 కోట్ల 20లకు పైగా టీకాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
17,68,190 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 44 లక్షల 71 వేలు గా నమోదు అయింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/