కరోనా వైరస్పై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ ల్యాబ్లోనే తయారైంది..సహజమైనది కాదు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్లో నుండే పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యలో తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నోట కూడా వినిపించాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన వైరస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ వైరస్ సహజమైనది కాదు. దానిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. అందుకే, ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు’ అని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంతోపాటు, భారత్ కూడా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమైందన్నారు. అదే సమయంలో… లాక్డౌన్ను ఎక్కువకాలం కొనసాగించలేమని అన్నారు. కాగా ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శ్రమిస్తున్నాయన్న గడ్కరీ.. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/