ఇండియాకు రాలేమంటున్న న్యూజిలాండ్‌ ఆటగాళ్లు

29 నుంచి మొదలు కానున్న ఐపీఎల్..న్యూజిలాండ్ ఆటగాళ్లు, కరోనా భయం

new zealand team
new zealand team

ముంబయి: ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 13వ సీజన్ పోటీలు ప్రారంభం కానుండగా, వివిధ టీముల్లో సభ్యులుగా ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు, కరోనా భయంతో ఇండియాకు రాలేమని అంటున్నారు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పీఆర్వో రిచర్డ్ బుక్ వెల్లడించారు. తమ ఆటగాళ్లను పంపేందుకు వెనుకంజ వేస్తున్నామని ఆయన అన్నారు. ఇండియాలో 29 మందికి కరోనా సోకిందని గుర్తు చేసిన ఆయన, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పూర్తి స్థాయి రిపోర్టును కోరామని, ఆ తరువాత మాత్రమే తమ దేశపు ఆటగాళ్లను ఇండియాకు పంపాలా? వద్దా? అన్న విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు.

కాగా, ఈ సీజన్ లో జిమ్మీ నిశమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), లాకీ ఫెర్గుసన్ (కోల్ కతా నైట్ రైడర్స్), మిషెల్ మెక్‌ క్లాగాన్, ట్రెంట్ బోల్ట్(ముంబై ఇండియన్స్), కేన్ విలియమ్సన్ (సన్‌ రైజర్స్ హైదరాబాద్), మిషెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) ఆయా జట్ల తరఫున ఆడుతున్నారు. అయితే, వైరస్ నివారణపైనా, ఆటగాళ్లకు వైరస్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపైనా రిపోర్టులను అందుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని రిచర్డ్ బుక్ వ్యాఖ్యానించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/