భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 35,178 నమోదు
New Delhi: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 25 వేల దిగువకు వచ్చిన కరోనా కేసులు ఇవాళ మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 440 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/