దేశంలో కరోనా విశ్వరూపం
24 గంటల్లో 5వేల పాజిటివ్ కేసులు
New Delhi: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా దేశంలో సగటున నాలుగు వేల మందికి కరోనా సోకుతున్నది.
గడిచిన 24 గంటలలో అంటే శనివారం నుంచి ఆదివారం వరకూ దేశంలో 5000 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ దేశంలో ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 2,347 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి..
అలాగే, దేశంలో కరోనాతో ాదివారం ఒక్మక రోజే 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,698కి చేరగా.. మరణాలు 3,000 మార్క్ దాటింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/