రోడ్ల దుస్థితిపై తూగో.. జిల్లాలో వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసిన గుంతల రోడ్లే..వాటిఫై ప్రయాణించాలంటే మనుషులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిందే. మా రోడ్లు బాగుచెయ్యండి అంటూ మొదటి నుంచి మొత్తుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో తూర్పు గోదావరి జిల్లాలో వినూత్నంగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

గుంతల రోడ్డు ఫై జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ ముఖ్యమంత్రి ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్డు వేసే వరకు ఈ బోర్డు ఎవరూ తీయకూడదని.. ఈ బోర్డును తొలగిస్తే.. వారు వారి కుటుంబం ఈ రోడ్లపైనే పోతారు అంటూ రాశారు. అనపర్తి-బలభద్రపురం రోడ్డు మధ్య ఉన్న ఈ ఫ్లెక్సీల ఫొటోలను జనసేన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.