పాకిస్తాన్‌లో కరోనా ప్రమాద ఘంటికలు

1600 కు చేరిన పాజిటివ్‌ కేసులు, 17 మరణాలు

in pakistan tempareture cheking
in pakistan tempareture cheking

పాకిస్తాన్‌: మన పొరుగుదేశం పాకిస్తాన్‌ లో కరోనా వ్యాప్తి అధికమవుతుంది. ఇప్పటి వరకు అక్కడి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1600 కు చేరింది. కాగా 17 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాసియాలోనే అధికంగా కేసులు నమోదైన దేశం పాకిస్తాన్‌ కావడంతో కరోనా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాని ఇప్పటివరకు పాకిస్తాన్‌ మాత్రం లాక్‌డౌన్‌ విదించడం లేదు, కేవలం కొన్ని ప్రాంతాలలోనే లాక్‌డౌన్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాని పాకిస్తాన్‌లో కరోనా విషయంలో కొన్ని ప్రావిన్స్‌లు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/