రైలు ప్లాట్ ఫారంపై తృటిలో తప్పిన ప్రమాదం: మహిళను కాపాడిన కానిస్టేబుల్

తిరుపతి స్టేషన్ లో ఘటన

Tirupati: రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కొద్దిట్లో ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. కదులుతూ ఉన్న రైలు నుంచి కిందకు దిగే క్రమంలో ప్లాట్ ఫారం పైకి దూకింది. కాలు జారీ రైలు మధ్యలో పడిపోయింది. అదే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సతీష్ గమనించి ఆమెను వెంటనే చాకచాక్యంగా ఇవతలకు లాగేయటంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. విశాఖ గాజువాకకు చెందిన భార్యాభర్తలు తిరుమల దర్శనార్ధం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం సాయంత్రం వైజాగ్ నుంచి బయల్దేరారు. బుధవారం ఉదయం రైలు తిరుమల చేరుకుంది. గాఢ నిద్రలో ఉన్న వీరు లేచే లోపే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదిలింది. హడావిడిగా మహిళ తిరుపతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగేందుకు ప్రయత్నించి కింద పడిపోయింది. ప్రమాదం నుంచి మహిళను రక్షించిన సతీష్‌ను రైల్వే అధికారులు అభినందించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/