కెటిఆర్ వ్యాఖ్యలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగా సంపాదించారన్న కెటిఆర్‌

minister-ktr

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డబ్బు తీసుకుని ఓటేయాలంటూ కెటిఆర్ ప్రజలకు సూచిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగానే సంపాదించారని, ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతారని, కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలని కెటిఆర్ ఇటీవల ఓ సభలో పిలుపునిచ్చారు. కెటిఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వేణుగోపాలస్వామి పేర్కొన్నారు. కెటిఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ను కోరారు. కెటిఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే, తాము కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.