ఆ వీడియోలో ఎక్కడ కూడా బిజెపి నేతల ప్రస్తావనే లేదుః కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

union-minister-kishan-reddy-counter-on-cm-kcr-comments

న్యూఢిల్లీః ఫాంహౌస్ ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్‌ నిన్న రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ చూస్తే చప్పగా ఉంది…ముందు ముందు కెసిఆర్‌ చూపించబోయే సినిమా కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఉందన్నారు కిషన్‌రెడ్డి. అసలు ఆ వీడియోలో ఎక్కడ కూడా బిజెపి నేతల ప్రస్తావనే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా అని ప్రశ్నించారు.

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, టిఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో ఫామ్​హౌజ్​ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. బిజెపి కీలక నేతలైన అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్​లపై కెసిఆర్‌ చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన ఖండించారు. కెసిఆర్‌ చూపించిన వీడియోలో ఉన్నవారితో.. బిజెపికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కెసిఆర్‌​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మొత్తం ఎపిసోడ్‌లో బిజెపి నాయకులు లేరన్నారు…టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే దౌర్భాగ్యం బిజెపికి లేదన్నారు.అంతా ఊహాజనితం అన్నారు కిషన్‌రెడ్డి. కేసీఆర్‌ ప్రభుత్వం బలహీనమైన ప్రభుత్వామా? రోహిత్‌ రెడ్డి నిజాయితీ పరుడా? తెలంగాణ రత్నాలు ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే శక్తి మాకు లేదా? స్వామిజీలు మాకు అవసరామా? బ్రోకర్లు అవసరమా? మీకు అవసరం ఏమో,,,మాకు లేదన్నారు కిషన్‌రెడ్డి. ఫాంహౌస్‌లో పడుకునే మీరు ప్రజాస్వామ్యం గురించి మీకు మాట్లాడే హక్కు లేదన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/