గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..

నెల మారిందంటే చాలు అనేక మార్పులు జరుగుతుంటాయి. నిత్యా అవసర ధరలు , గ్యాస్ సిలిండర్ ధర , పెట్రోల్ డీజిల్ ధరలు , బ్యాంకు వడ్డీలకు సంబంధించి మార్పులు ఇలా ఎన్నో జరుగుతాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు అనేవి ప్రతి నెల జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు జూన్ మొదలు కావడం తో గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపారు గ్యాస్ సంస్థలు. కాకపోతే ఈ గుడ్ న్యూస్ అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ వాడే వారికే.

దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. ఢిల్లీలో రూ.1,676, కోల్‌కతాలో రూ. 1,787, ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ. 1,840లకు తగ్గాయి. మే 1న కూడా రూ.19 మేర, అంతకుముందు ఏప్రిల్‌లో రూ.30.50 మేర తగ్గింది. దీంతో ఆర్థిక సవాళ్ల మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారస్తులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు.