రేపు మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శంచుకోనున్న సీఎం రేవంత్

CM Revanth will visit Medaram Sammakka Saralamma tomorrow

హైదరాబాద్‌ః తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 23న అంటే రేపే సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లనున్నారు, సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీకు అని ఏపాట్లు చేశారు అధికారులు. కాగా,తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. సారలమ్మకు గిరిజనులు సాక పోశారు. గిరిజన సంప్రదాయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపై బయల్దేరారు. రేపు గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.