నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

cm-revanth-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి..మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఢిల్లీలో రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉండే ఛాన్స్‌ ఉండనుంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలందరినీ కలిసే అవకాశం ఉంది. జూన్ 2 వేడుకలకు సోనియాను సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఆహ్వానించనున్నారు.