రేవంత్ కాబినెట్ సమావేశంలో కీలక అంశాల ఫై చర్చ

తెలంగాణ సీఎం గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి..గురువారం సాయంత్రం కాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాబినెట్ మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. దాదాపు గంటా 40 నిమిషాలపాటు కేబినెట్ భేటీ కొనసాగింది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. ప్రజలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా లోపలికి అనుమతించనున్నారు.