కాంగ్రెస్ విజయం ఫై రేవంత్ స్పందన

revanth-reddy-press-meet

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని.. డిసెంబర్ 3 2023 చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి డిసెంబర్ 3వ తేదీన అమరడయ్యాడని.. ఇదే రోజు కాంగ్రెస్ సాధించిన ఈ విజయం అమరులకు అంకితం ఇస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఇక సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయని.. ప్రగతి భవన్ ఇక డాక్టర్ అంబేద్కర్ భవన్‌గా మారుతుందని తెలిపారు. ఇకపై అది ప్రగతి భవన్ కాదని.. ప్రజా భవన్ అని తెలిపారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.