ప్ర‌తి విద్యార్థి నాణ్య‌మైన విద్య‌ను పొందాల‌నేది అంబేద్క‌ర్ క‌ల‌ : సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్‌ల‌ను ప్రారంభించిన సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని 240 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్ర‌తి విద్యార్థి నాణ్య‌మైన విద్య‌ను పొందాల‌నేది డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ క‌ల అని కేజ్రీవాల్ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం గ‌త ఏడేండ్ల‌లో 7 వేల త‌ర‌గ‌తి గ‌దుల‌ను నూత‌నంగా నిర్మించింద‌న్నారు. మ‌రి ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం 20 వేల క్లాస్ రూమ్‌ల‌ను కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇతర రాష్ట్రాల్లో అంబేద్కర్ కల నెరవేరలేదని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ మంత్రి మ‌నీష్ సిసోడియా, హోంమంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/