కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని సిఎం కెసిఆర్ దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్కు మంత్రి హరీశ్ రావు స్వాగతం పలుకగా, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. పూజల అనంతరం వేదపండితులు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందిచారు. ఎన్నికల్లో నామినేషన్ వసే ప్రతిసారి కెసిఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బిఆర్ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.
కాగా, కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సిఎం కెసిఆర్, పార్టీకి సెంటిమెంట్గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సిఎం కెసిఆర్ నామినేషన్ వే స్తారు. కెసిఆర్, హరీశ్రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సిఎం కెసిఆర్కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టిడిపికి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కెసిఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టిఆర్ఎస్ పార్టీని ప్రకటించారు.