నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కెసిఆర్ (ఈరోజు) బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.