కొల్లూరి చిరంజీవి మృతిపై సీఎం కెసిఆర్ సంతాపం
చిరంజీవి మృతి తీరని లోటు ..మంత్రి హరీష్ రావు
cm kcr- kolluri-chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిపట్ల సీఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి తెలంగాణకు తీరని లోటు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న సమయంలో,విద్యార్థులందరినీ కూడగట్టి 1969 ఉద్యమంలో చిరంజీవి కీలకపాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/