‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు ప్రధాని మోడీ శ్రీకారం

YouTube video

అహ్మ‌దాబాద్‌: 75వ‌ స్వాతంత్ర్య వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని 75 వారాలపాటు నిర్వ‌హించత‌ల‌పెట్టిన‌ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’​ కార్య‌క్రామానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శ్రీకారం చుట్టారు. ఈ మేర‌కు గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ భారీ కార్య‌క్ర‌మంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’​ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు.

అనంత‌రం సబర్మతి ఆశ్రమం వ‌ద్ద జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. దండియాత్ర నిర్వహించి 91 ఏండ్లు అయిన సంద‌ర్భంగా చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర కూడా దండి వరకు సాగనుంది. 81 మందితో ప్రారంభ‌మై 25 రోజులపాటు 241 కిలోమీటర్ల మేర‌ యాత్ర జ‌రుగుతుంది. మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఈ దండి మార్చ్‌లో భాగస్వామ్యం కానున్నారు. ఈ యాత్ర‌కు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ నేతృత్వం వహించనున్నారు.

पीएम मोदी ने साबरमती आश्रम में महात्मा गांधी को दी श्रद्धांजलि

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/